Bank Charges increased

 నేటి నుంచి చార్జీల బాదుడు 

Jul 1 2021


న్యూఢిల్లీ : వివిధ బ్యాంకుల వినియోగదారులు, సగటు ప్రజల రోజువారీ జీవితాలను ప్రభావితం చేసే కొన్ని మార్పులు జూలై ఒకటో తేదీ నుంచి (గురువారం) అమలులోకి రానున్నాయి. .


ఎస్‌బీఐ ఏటిఎం చార్జీల సవరణ : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాదారుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించబోతోంది. ఏటీఎంల నుంచి ఉచితంగా నగదు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటును నెలకి నాలుగుకే పరిమితం చేయనుంది. ఆ పైబడిన నగదు విత్‌డ్రాయల్స్‌పై ఒక్కో దానికి 15 రూపాయలు+జీఎస్‌టీ చెల్లించుకోక తప్పదు. చెక్‌బుక్‌ వినియోగాన్ని కూడా పరిమితం చేసింది. ఏడాదికి 10 చెక్‌ లీవ్స్‌ను మాత్రమే అందించబోతోంది. అది దాటితే ప్రతీ కొత్త చెక్‌బుక్‌ పైన అదనపు భారం మోయక తప్పదు.


ఐడీబీఐ బ్యాంకు : ఐడీబీఐ బ్యాంకు కూడా చెక్‌బుక్‌, సేవింగ్స్‌ ఖాతాలు, లాకర్‌ చార్జీలు పెంచుతోంది. 20 పేజీల చెక్‌బుక్‌ ఉచితంగా అందిస్తుంది. ఆ పైబడిన ప్రతీ చెక్కు పైన రూ.5 వసూలు చేస్తుంది. సబ్‌ కా సేవింగ్స్‌ అకౌంట్‌ ఖాతాదారులకు ఇవి వర్తించవు.


సిండికేట్‌ బ్యాంక్‌ ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌లు మార్పు : సిండికేట్‌ బ్యాంక్‌లో కెనరాబ్యాంక్‌ విలీనం అయిన నేపథ్యంలో జూలై ఒకటో తేదీ నుంచి ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌లు మారనున్నాయి. ప్రతీ ఒక్క ఖాతాదారుడు తమ బ్రాంచి కొత్త ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌ తెలుసుకోవలసిందిగా సూచించింది. 


కొత్త చెక్‌బుక్‌లు: ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకు రెండూ యూనియన్‌ బ్యాంకులో విలీనం అయినందు వల్ల ఆ రెండు బ్యాంకుల చెక్‌బుక్‌లు రద్దు కానున్నాయి. ఆ బ్యాంకుల ఖాతాదారులు తమ బ్రాంచిలకు వెళ్లి కొత్త చెక్‌బుక్‌లు తీసుకోవాలని సూచించారు. 


ఐటీ రిటర్న్‌ దాఖలు చేయని వారిపై అదనపు టీడీఎస్‌ : గత రెండు సంవత్సరాల కాలానికి ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయని వారికి  అదనపు టీడీఎస్‌ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వార్షిక టీడీఎస్‌ రూ.50 వేలు దాటిన ఖాతాదారులందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది


Comments

Popular posts from this blog

Indian Government giving tax benefits to few chosen big corporate

Real story of submarine PNS Ghazi and the mystery behind its sinking

UN General Assembly (UNGA 73) & (UNGA 74)